హైద‌రాబాద్ : ఎంఐఎం పార్టీకి భారీ షాక్…!

హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. మాజీ కార్పోరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ రాజీనామా ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఖాజా బిలాల్ అహ్మ‌ద్ ఎంఐఎం పార్టీపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఎంఐఎం పార్టీ మ‌తోన్మాద బీజేపీతో కుమ్మ‌క్కైంద‌ని ఆరోపించారు.

పాతబస్తీ అభివృద్ధిని ఎంఐఎం విస్మరిచిందని, మెట్రోరైలు, 12శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడడం లేదని విమ‌ర్శించారు అహ్మ‌ద్. మజ్లీస్ పార్టీ వల్లనే త‌న‌పైన రౌడీ షీట్, పీడీ యాక్ట్ లు నమోదయ్యాయన్నారు..పాస్ పోర్ట్ కూడా రద్దు అయ్యిందని చెప్పారు ఆయ‌న.

బిజెపిని గెలిపించేందుకే ఉత్తర్ ప్రదేశ్,మహారాష్ట్రలలో ఎంఐఎం పోటీ చేసిందని ఆయ‌న ఆరోపించారు. మజ్లీస్ నియంతృత్వ పార్టీ అని, ముస్లింలను రెచ్చగొట్టి లబ్దిపొందుతుందని ఆయ‌న అన్నారు. తన చివరి శ్వాసఉన్నంత వరకు లౌకిక వాదులతో ఉంటాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తనను ఎంఐఎం పార్టీ ఎన్ కౌంటర్ చేసినా భయపడేదిలేదన్నారు.