అజ్ఞాతం వీడిన వ‌నితా రెడ్డి

న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య త‌రువాత అజ్ఞాతంలోకి వెళ్లిన అతని భార్య వ‌నితారెడ్డి పోలీసుల ముందు ప్ర‌త్య‌క్ష‌మైంది. విజయ్ మ‌ర‌ణానికి వ‌నితానే కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె అజ్ఞాతంలోకి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఆమె అక‌స్మాత్తుగా జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

జూబ్లీహిల్స్ పోలీసుల నోటీసుకు సమాధానమ్ ఇచ్చేందుకే పోలీసుల ముందుకు వచ్చాన‌ని, సాక్ష్యాలు సేకరించేందుకు సమయం తీసుకున్నాన‌ని ఆమె చెప్పారు. విజయ్ సాయి తల్లిదండ్రుల వేధింపుల వల్లే చనిపోయాడని, తాను మూడేళ్లుగా విజయ్ కి దూరం గా ఉన్నాన‌ని ఆమె అన్నారు. త‌న‌ కూతురు భవిష్యత్తు కోసమే ఇన్ని రోజులు అజ్ఞాతం లో ఉన్నాన‌ని, అంతే కానీ అంద‌రూ చెప్పుకుంటున్న‌ట్లుగా కారు వ్య‌వ‌హారం అస‌లే కాద‌ని ఆమె తెలిపారు.