టీడీపీలోకి బైరెడ్డి..!?

రాయ‌ల‌సీమ నేత బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి తిరిగి టీడీపీ గూటికి చేర‌నున్నారు. గురువారం ఆయ‌న ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశ‌మ‌య్యారు. కార్య‌క‌ర్త‌లో మాట్లాడి సంక్రాంతి త‌రువాత చేర‌నున్న‌ట్లు ఆయ‌న సంకేతాలిచ్చారు. చంద్రబాబు నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని ఆయ‌న చెప్పారు. పార్టీలో తిరిగి చేరాలంటే కొందరు వ్యతిరేకించడం.. ఇంకొందరు స్వాగతించడం సహజమేన‌ని ఆయ‌న అన్నారు.

టీడీపీని 19 ఏళ్లు మోశాన‌ని, అధికారంలో లేకున్నా పార్టీ కోసం పని చేశాన‌ని బైరెడ్డి అన్నారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయిన పాములపాడు మండలంలోని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిపించిన చరిత్ర త‌మ‌ద‌ని చెప్పారు బైరెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో త‌న‌ అనుచరుణ్ని పోటీ నుంచి తప్పించే అంశాన్ని సీఎంతో చర్చించలేదని, పోటీలో ఉంచాలా..? వద్దా అనేది అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాన‌న్నారాయ‌.