క‌ల‌క‌త్తాలో తెలుగు విద్యార్థుల‌పై వివ‌క్ష‌..!

ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కు హాజరయ్యేందుకు సుమారు వంద‌మంది తెలుగు విద్యార్థులు క‌ల‌క‌త్తా వెళ్లారు. అక్క‌డ వెళ్లిన విద్యార్థులు వ‌స‌తులు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. వసతి లేకపోవడంతో విద్యార్ధులు వ‌రండాల్లో పడుకుంటున్నారు.

ఇండియ‌న్ హిస్ట‌రీ కాంగ్రెస్ కు వేదికైన జాదవపూర్ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి వసతి ఏర్పాట్లకు 1500 రూపాయలు వసులుచేసిందట‌. తీరా అక్కడికి వెళ్ళాక యూనివ‌ర్శిటీ నిర్వాహ‌కులు చేతులెత్తేశార‌ట‌. ఉత్తర ,దక్షిణ భారత విద్యార్థుల మధ్య వివక్ష చూపుతున్నార‌ని తెలుగు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ, ఇతర యూనివర్సిటీ విద్యార్థులు రాగానే రూములిచ్చి త‌మ‌కుమాత్రం ఇవ్వట్లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రెండురోజులుగా రూములు ఇవ్వకుండా దాటవేస్తున్నర‌ని విద్యార్ధులు త‌మ క‌ష్టాలు చెప్పుకుంటున్నారు.