వేణుగోపాలుడిగా యాదాద్రి నార‌సింహుడు.

శుక్ర‌వారం వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా యాదాద్రి ఆల‌యంలో స్వామి వారి అధ్య‌య‌నోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. మొద‌టిరోజు గ‌రుడ వాహ‌నంపై ద‌ర్శ‌న‌మిచ్చారు స్వామివారు. అధ్య‌య‌నోత్స‌త‌వాల‌లో భాగంగా నేడు రెండ‌వ‌రోజు వేణుగోపాల స్వామి అలంకారంలో భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తున్నాడు యాదాద్రివాసుడు. ఆరు రోజుల‌పాటు జ‌న‌వ‌రి 3వ‌తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న ఈ అధ్య‌య‌నోత్స‌వాల‌లో ఒక్కోరోజు ఒక్కో రూపంలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు ఆ యాదాద్రి శ్రీ లక్ష్మీ నార‌సింహుడు.