ఎర్రోళ్ల‌కు సీఎం న్యూఇయ‌ర్ గిఫ్ట్..

ఉద్య‌మ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ప‌నిచేస్తున్న నేత ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ . హ‌రీష్ వ‌ర్గంగా స్టాపు ప‌డిన ఆయ‌న‌కు టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి స‌రైన ప‌ద‌వి ఇవ్వ‌లేక‌పోయారు సీఎం కేసీఆర్. హ‌రీష్ వ‌ర్గం కావ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప‌ద‌వీ రాలేద‌నే టాక్ న‌డుస్తూ వ‌చ్చింది. అయితే కొంచెం లేట్ అయినా సీఎం కేసీఆర్ ఎర్రోళ్ల‌కు మంచి అవ‌కాశం క‌ల్పించారు. ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ చైర్మ‌న్ గా నియ‌మిస్తూ న్యూఇయ‌ర్ గిఫ్ట్ ఇచ్చారు సీఎం.

ముందునుంచి కేసీఆర్ కు సైనికుడి గా పనిచేసాన‌ని, ఇప్పుడు త‌న‌ మీద నమ్మకంతో ఎస్సి,ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఎర్రోళ్ల శ్రీ‌నివాస్. తాను ఎప్పుడూ పదవుల ఆశించి ప‌నిచేయ‌లేద‌ని, ఆలస్యంగా వచ్చిందని భావించడం లేదని ఆయ‌న అన్నారు. కేసీఆర్ కు ఎప్పుడు ఎవరికీ ఏ పదవి ఇవ్వాలో తెలుసని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పూర్తి స్థాయిలో పనిచేస్తాన‌ని ఆయ‌న చెప్పారు.