ఆ దర్శకుడు వస్తున్నాడు.. ‘అజ్ఝాతవాసి రీమేక్’ని తేల్చేస్తాడు.. !

దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ని ‘అజ్ఝాతవాసి’ గా చూపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ‘అజ్ఝాతవాసి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ‘అజ్ఝాతవాసి’ ఫ్రెంచ్ చిత్రం ‘లార్గోవించ్’కి రీమేక్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అజ్ఝాతవాసి టీజర్ బయటికొచ్చినప్పటి నుంచీ ఈ ప్రచారం మొదలయ్యింది. ఇప్పుడీ న్యూస్’ని జాతీయ మీడియా కూడా మోస్తుంది. చివరికి ఈ న్యూస్ ‘లార్గోవించ్’ దర్శకుడు జెరోమ్ సాల్లీకి చేరింది.

‘లార్గో వించ్’ రీమేక్ హక్కులను కలిగివున్న టీ-సిరీస్.. అజ్ఝాతవాసి చిత్రబృందానికి నోటీసులు జారీ చేసిందన్న విషయాన్ని పత్రికల కథనాల్లో చూసి జెరోమ్ తెలుసుకొన్నాడు. ఆ వెంటనే జెరోమ్ సాల్లీ ఇండియాకు వచ్చేందుకు రెడీ అయ్యారు. “నేను ఆ సినిమాకు ఓ టికెట్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను (అంతకన్నా ముందు విమానం టికెట్)” అని జెరోమ్ ట్వీట్ చేశారు.

మరోవైపు, పవన్-త్రివిక్రమ్’ల కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అజ్ఝాతవాసి’ కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ‘అజ్ఝాతవాసి’పై వస్తోన్న రీమేక్ వార్తలు అభిమానులని కలవర పెడుతున్నాయి. మరీ.. చివరకు ‘అజ్ఝాతవాసి’ రిమేక్ అని తేలుతుందా ? లేదా ?? ఆసక్తిగా మారింది.