త్వ‌ర‌లోనే స్కైవేల క‌ల సాకారం : మంత్రి కేటీఆర్

అత్యుత్తమ జీవన ప్రమాణాలు గల నగరంగా దేశంలో హైదరాబాద్ నెంబర్ వన్’గా నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్ అర్ డి ప్రాజెక్టులో భాగంగా  హైటెక్ సిటీ  మాధపూర్ నుంచి శిల్పరామం మీదుగా  నిర్మించిన అడర్ పాస్ మార్గాన్ని ఆయ‌న ప్రారభించారు. 2900 కోట్ల తో కొత్త మార్గలను అభివృద్ధిపరుస్తున్నామని ఆయ‌న అన్నారు.

1000 కోట్ల రూపాయల తో గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నామ‌ని, పివి ఎక్స్ ప్రెస్ హైవే తరహలో జెబిఎస్ నుంచి రాజీవ్ రహదారి వరకు నిర్మిస్తున్నామని అందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, రక్షణ శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంద‌ని ఆయ‌న తెలిపారు. ప్యాట్నీ నుంచి బోయిన్ పల్లి వరకు స్కై వేలు, ఉప్పల్ నుంచి నారపల్లి వరకు  స్కై వే నిర్మాణ దశ లో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.