కేంద్ర‌మంత్రిని క‌లిసిన ఎంపీ క‌విత‌

కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఎంపీ క‌విత క‌లిసారు. నిజామాబాద్ జిల్లాలోని జ‌క్రాన్ ప‌ల్లిలో విమానాశ్ర‌యం ఏర్పాటు చేయాల‌ని ఎంపీ క‌విత కేంద్ర‌మంత్రిని కోరారు. జ‌క్రాన్ ప‌ల్లిలో విమానాశ్ర‌యం ఏర్పాటు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని, ఇందుకోసం అక్క‌డికి కేంద్ర క‌మిటీని పంపించాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌యంపై కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు సానుకూలంగా స్పందించారు.