హీరోలని పడేయడమే.. ఆ హీరోయిన్ టార్గెట్ !

టాలీవుడ్ హీరోలని తన బుట్టలో పడేసుకోవడమే టార్గెట్’గా పెట్టుకొంది.. ఓ కన్నడ హీరోయిన్. ఇప్పటికే యంగ్ హీరోలు నిఖిల్, నాగసూర్య, విజయ్ దేవరకొండలని పడేసింది. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా ఈ కిర్రాక్ బ్యూటీకి పడిపోయినట్టు చెబుతున్నారు. ఇంతకీ ఆ కిర్రాక్ హీరోయిన్ ఎవరంటే ? రష్మిక మందన. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కిర్రాక్ పార్టీ’తో ఫేమస్ అయిపోయింది.

ఇప్పుడీ కిర్రాక్ భామకు తెలుగులో వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఇప్పటికే నిఖిల్, నాగసూర్య, విజయ్ దేవరకొండల సినిమాలో నటిస్తోంది. తాజాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న రామ్ సినిమా కోసం రష్మికని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.