కేర‌ళ‌ను త‌ల‌పించే అమ‌రావ‌తి హౌస్ బోట్స్…!

ఏపీలో టూరిజం అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటోంది ప్ర‌భుత్వం . కేర‌ళ త‌ర‌హాలో హౌస్ బోట్ ల‌ను ఏర్పాటు చేసి ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించాల‌నే ఆలోచ‌న‌లో ఉంది. విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద టూరిజం ను అభివృద్ది చేయాల‌ని చ‌ర్య‌లు చేప‌ట్టింది.

కృష్ణాన‌దిలో హౌస్ బోట్లు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మొద‌టి ద‌శ‌లో 15హౌస్ బోట్స్ ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఒక్కో బోటు విలువ సుమారు కోటిరూపాయ‌లు ఉంటుంద‌ని, ఎస్సీ కార్పోరేష‌న్ ద్వారా స‌బ్సిడీ ఇచ్చి బోట్లు ఏర్పాటు చేసేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని ఏపీ ప‌ర్యాట‌క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి మీనా చెబుతున్నారు. అమ‌రావ‌తికి ప‌ర్యాట‌కంగా అభివృద్ధి చేయ‌డంతో పాటు కొత్త అందాల‌ను తీసుకొస్తున్నారు అధికారులు. కోటి రూపాయ‌లు విలువ చేసే ఆ హౌస్ బోట్ లో ఎలాంటి స‌దుపాయాలున్నాయో మీరు ఓ లుక్కేయండి…