‘సాహో’కు 240కోట్లు సరిపోలేదా.. ?

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాహుబలి రేంజ్’లో సాహోని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు రూ. 150కోట్ల భారీ బడ్జెట్’తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐతే, సినిమా సెట్స్ మీద ఉండగానే ‘సాహో’ బంపర్ ఆఫర్ వచ్చినపడినట్టు సమాచారమ్.

ప్రభాస్ ‘సాహో’కు టీ-సిరీస్ భారీ ఆఫర్ ని ఇచ్చింది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ థియేట్రికల్ హక్కులని తీసుకొనేందుకు రూ. 240కోట్లు ఆఫర్ చేసింది. ఐతే, ఈ ఆఫర్ ని చిత్రబృందం సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. కేవలం థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 240కోట్లు వస్తే.. మిగిలిన శాటిలైట్, ఇతర రైట్స్ రూపంలో మరో రూ. 100కోట్లు రావడం గ్యారెంటీ. ఈ లెక్కన రిలీజ్ కి ముందే రూ. 100కోట్లకుపైగా లాభాలు. మరీ.. యూవీ క్రీయేషన్స్ కి ఇంతకంటే ఇంకేం కావాలి. బాహుశా.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రైట్స్ ని అమ్మాలని డిసైడ్ అయి ఉంటారేమో..!

ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటించనుంది. ఆమెది విభిన్నమైన పాత్ర అని చెబుతున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు, టెక్నీషన్స్ ‘సాహో’ కోసం పని చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొన్న సాహో.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ దుబాయ్ లో జరగనుంది.