గ‌డ్డాలు పెంచుకుంటే గ‌బ్బ‌ర్ సింగ్ లు కాలేరు : మంత్రి కేటీఆర్

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ చుర‌క‌లు వేశారు. రైతుల పొలాల్లో నీళ్లు వస్తే, కాంగ్రెస్ కిందికి నీళ్లు వస్తాయని భయపడుతున్నారన్నారు. గడ్డాలు పెంచుకున్న వారు స‌న్నాసులు అవుతారు త‌ప్ప అధికారంలోకి రార‌ని అన్నారు. గ‌డ్డాలు పెంచుకున్నంత మాత్రాన గ‌బ్బ‌ర్ సింగ్ లు కాలేర‌న్నారు మంత్రి కేటీఆర్.

గుజరాత్ లో అందరు ఏకమైనా కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింద‌ని, తెలంగాణాలో కాంగ్రెస్ ఎప్ప‌టికీ అధికారంలోకి రార‌న్నారు. తప్పుడు వార్తను చూసి కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారని, గోల్ మాల్ చేసే కాంగ్రెస్ చిల్లరగాళ్ల ఆటను కట్టించాలంటూ ఆయ‌న ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడారు.