కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ ల‌పై వీహెచ్ పంచ్ మీద పంచ్…!

కాంగ్రెస్ నేత వీహెచ్ సీఎం కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ ల‌పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌క‌పోయి ఉంటే కేసీఆర్, ఆయ‌న కుటుంబం నాంప‌ల్లి ద‌ర్గా ద‌గ్గ‌ర అల్లా కే నామ్ పే అంటూ బిచ్చ‌మెత్తుకునేవార‌ని అన్నారు. ఢిల్లీ, గ‌ల్లీ అంటూ మంత్రి కేటీర్ ఇవాళ ఏవేవో మాట్లాడుతున్నార‌ని, అప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ కాళ్లు ప‌ట్టుకున్న సంగ‌తి మ‌రిచిపోయారా అంటూ ప్ర‌శ్నించారాయ‌న‌.

సీఎం కేసీఆర్ , ఆయ‌న కుటుంబంతో పాటు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పై కూడా ఆయ‌న ఫైర్ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ సీఎం కేసీఆర్ కు చెంచాగిరి చేస్తున్నార‌ని, ఇలాంటి గ‌వ‌ర్న‌ర్ ను త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని ఆయ‌న అన్నారు. తాను ముప్పై ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇలాంటి చెంచాగిరి చేసే గ‌వ‌ర్న‌ర్ ను చూడ‌లేద‌న్నారు. ఇక గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసినా లాభంలేద‌ని, ఆయ‌న్ను క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు వీహెచ్.