డబుల్ రేటుకి ‘అజ్ఝాతవాసి’ టికెట్ ధర.. !

ఈ సంక్రాంతికి సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’తో పొంగల్ పోరుకు తెరలేపనున్నారు. ఈ నెల 10న అజ్ఝాతవాసి, 12న జై సింహా సినిమాలు రాబోతున్నాయి. వీటికితోడు ఒకట్రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలు దాడి చేయబోతున్నాయి. ఐతే, అందరీ చూపు ‘అజ్ఝాతవాసి’పైనే నెలకొంది. ఇప్పుడీ సినిమా టికెట్ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.


ఇప్పటికే ‘బుక్ మై షో’ అప్లికేషన్ లో టికెట్స్ బుకింగ్ ప్రారంభమైపోయింది. బెంగళూరు, హైదరాబాద్’లతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, ఒంగోలు, విశాఖ, వరంగల్, నిజామాబాద్, నల్గొండ.. తదితర అర్భన్ సెంటర్స్ లో బుక్ మై షో టికెట్ బుకింగ్ ఓపెన్ చేసింది. టికెట్ రేటుకు రెండింతల ధరతో టికెట్ ని అమ్ముతున్నారు. రూ. 225 పైనే టికెట్ ధర నిర్ణయించారు. సంక్రాంతి పండగ సీజన్’లో ఎంతైనా టికెట్ ధరలు పెంచుకోవచ్చన్న హైకోర్టు తీర్పుతో టికెట్ రేట్స్ కు రెక్కలొచ్చాయి. దీంతో ఓ మధ్యతరగతి కుటుంబం పండగపూట ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక, ఈ సినిమా ప్రీమియర్ షోల సంగతి చెప్పనక్కర్లేదు. యుఎస్, తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ రోజు ముందుగానే అంటే ఈ నెల 9నే ప్రీమియర్ షోలు పడిపోనున్నాయి. ఈ టికెట్ రేట్ రూ. 500 నుంచి రూ. 5000 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. అయినా.. తమ అభిమాన హీరో సినిమాని ప్రిమియర్ షోస్ లోనే చూసేయాలని ఆరాపడుతున్నారు. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ప్రీమియర్ షోస్ టికెట్స్ కోసం రెఫరెన్స్ మొదలెట్టినట్టు తెలుస్తోంది.