‘జై సింహా’ సెన్సార్ రివ్యూ

నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ లోకి దిగితే అంతే.. ప్రేక్షకుల నుంచి రియాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన తాజా చిత్రం ‘జై సింహా’. కె ఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. ‘యు/ఎ’ సర్టిఫికెట్ దక్కించుకొంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ ‘జై సింహా’ పవరేంటో చూపించేశాయి. సినిమాకి పాజిటివ్ టాక్’ని తీసుకొచ్చాయి. ఇప్పుడు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా ‘జై సింహా’ సూపర్ అంటున్నారు.

ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ ప్రాణమని చెబుతున్నారు. ఈ ఏపీసోడ్ లో బాలయ్య నట విశ్వరూపం చూపించాడని సెన్సార్ టాక్. యాక్షన్ సీన్స్, సెకాంఢాప్ లో ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మొత్తంగా.. ఈ సంక్రాంతికి బాలయ్య మరోసారి గర్జించబోతున్నారు. అదే రేంజ్ లో ఉండబోతుందనేది చూడాలి.

ఇక, జై సింహా సూపర్ స్టార్ రజనీకాంత్ ముత్తుకు రిమేక్ అంటున్నారు. ఈ నేపథ్యంలో రజనీ స్టయిల్ లో బాలయ్య ఎలా ఉండబోతున్నాడు అని చూసుకోవడానికి బాలయ్య, రజనీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, హరిప్రియ, నటాషా దోషి జతకట్టనున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం. సి క‌ళ్యాణ్ నిర్మాత‌.