‘అజ్ఝాతవాసి’ ఆలస్యానికి అసలు కారణం.. ఇదే !

పవన్-త్రివిక్రమ్’ల ‘అజ్ఝాతవాసి’ రిలీజ్ డేటు దగ్గరపడుతోంది. మరో మూడు రోజుల్లో ‘అజ్ఝాతవాసి’ థియేటర్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఐతే, ఇప్పటి వరకు కూడా అజ్ఝాతవాసి ట్రైలర్’ని చూపించలేదు. వాస్తవానికి ఈ నెల 5న ట్రైలర్’కు ముహూర్తం పెట్టారు. ముహూర్తానికి ఓ రోజు ముందుగానే 4వ తేదిన ట్రైలర్ రాబోతుందని చెప్పుకొన్నారు. ఐతే, ఇప్పటి వరకు కూడా అజ్ఝాతవాసి ట్రైలర్ రిలీజ్ కాలేదు. దీంతో.. భయంకరమైన ప్రచారం మొదలయ్యింది.

‘అజ్ఝాతవాసి’పై టీ-సిరీస్ కాపీ రైట్ వివాదం సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారం కాస్త కోర్టుకెక్కింది. ట్రైలర్ సంగతి ప్రక్కన పెడితే అసలు సినిమా కూడా టైం రావడం కష్టమే అనే ప్రచారం మొదలయ్యింది. కొందరైతే.. ట్రైలర్ ని వదిలితే కాపీ సంగతి పూర్తిగా ఓపెన్ అవుతుందని రిలీజ్ చేయడం లేదని చెప్పుకొంటున్నారు. ఈ గాలి వార్తలకు అజ్ఝాతవాసి చిత్రబృందం గట్టి సమాధానమే ఇచ్చింది.

గాసిప్’కు చెక్ పెడుతూ అజ్ఝాతవాసి ట్రైలర్ రిలీజ్ ఆలస్యానికి అసలు కారణం చిత్రబృందం తెలిపింది. గురువారమే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యింది. చెన్నయ్’లో మిక్సింగ్, రీ రికార్డంగ్.. ముంబాయిలో సిజి వర్క్, డిజిటల్ కరెక్షన్.. హైదరాబాద్ లో డబ్బింగ్.. ఇలా తలో చోటా తలో పని జరుగుతున్నందున వీటిని కో-ఆర్డినేట్ చేసుకోవడానికే సరిపోతుంది. అందువలనే మీడియోలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై క్లారిటీ ఇవ్వలేకపోయాం. అజ్ఝాతవాసి కచ్చితంగా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేసింది చిత్రబృందం. సో.. పవన్ ఫ్యాన్స్. డోంట్ వర్రీ.. బీ హ్యాపీ… !