పవన్.. మళ్లీ సైకిల్ ఎక్కుతాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపే అజ్ఝాతవాసం విడవనున్నాడు. ఆయన తాజా చిత్రం ‘అజ్ఝాతవాసి’ సంక్రాంతి కానుకగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, రేపటి నుంచే ప్రీమియర్ షోస్ పడిపోతున్నాయి. ఈ లెక్కన రేపటితో పవన్ అజ్ఝాతవాసం ముగియనుంది. ఈ సినిమా రిలీజ్’కి ముందు వచ్చిన ట్రైలర్ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారీ తీసింది.

‘అజ్ఝాతవాసి’ సినిమాలో ‘పవన్ సైకిల్ ఎక్కే’ ఏపీసోడ్ చాలా కీలకం కానుంది. ఈ విషయం ఇప్పటికే రిలీజైన సినిమా పోసర్స్, ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ లో పవన్ సైకిల్ ఎక్కడం, చివర్లో రావు రమేష్ ని పవన్ మళ్లీ సైకిల్ ఎక్కుతాడా ? అని అడగటం చూస్తే.. ఏపీ పొలిటికల్స్ గుర్తొస్తున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో పవన్ భుజం కాయడం కారణంగానే టీడీపీ-భాజాపా కూటమి అధికారంలోకి వచ్చాయి. ఐతే, వచ్చే సాధారణ ఎన్నికలోపవన్ ‘జనసేన’ ఒంటరిగా పోటీ చేస్తామన్న సంకేతాలు ఇచ్చింది. ఆ దిశగా స్పష్టమైన అడుగులు మాత్రం పడటం లేదు.

ఈ నేపథ్యంలో.. పవన్ మళ్లీ సైకిల్ ఎక్కుతాడా ? అనే డైలాగ్ జనసేన అధినేత కన్పూజన్ లో ఉన్నట్టు కనబడుతోంది. మరోసారి.. పవన్’కు ఓట్లు చీల్చడం ఇష్టం లేదని, ఆయన మరోసారి టీడీపీకే సపోర్టు చేయనున్నాడనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలయ్యింది. మరీ.. ఇందులో నిజమెంత అనేది ? తెలియాల్సి ఉంది. అజ్ఝాతవాసి పూర్తి సినిమా చూస్తే మరింత సమాచారమ్ దొరుకుతుందేమో చూడాలి.