బీజేపీకి కొమ్మూరి ప్ర‌తాప్ రెడ్డి గుడ్ బై..?

తెలంగాణ బీజేపీకి మాజీ ఎమ్మెల్యే, కొమ్మూరి ప్ర‌తాప్ రెడ్డి గుడ్ బై చెప్ప‌నున్నట్లు తెలుస్తోంది. ఒక‌వైపు రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తుండ‌గా మ‌రోవైపు నేత‌లు ఇత‌ర పార్టీలోకి వ‌ల‌స వెలుతున్నారు. గ‌తంలో వ‌రంగ‌ల్ జిల్లాలోని చేర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ప‌ని చేసిన కొమ్మూరి త‌రువాత నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నలో జ‌న‌గామ నియోజ‌వ‌ర్గంగా మారింది.

టీఆర్ఎస్ పార్టీలో కీల‌కంగా ప‌నిచేసిన కొమ్మూరి గ‌తంలో బీజేపీ గూటికి చేరారు. గ‌త కొంత కాలంగా బీజేపీలో ఆయ‌న క్రియాశీల‌కంగా ప‌నిచేయ‌డంలేద‌నేది టాక్ .. తాజ‌గా మంత్రి హ‌రీష్ రావుతో మంత‌నాలు జ‌రిపార‌ని, ఇవాళ టీఆర్ఎస్ లోకి చేర‌తార‌ని స‌మాచారం. అయితే ఆయ‌న‌కు జ‌న‌గామ టికెట్ హామీపైనే ఆయ‌న అధికార పార్టీలో చేరుతున్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..