అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా.. !

ఈ యేడాది సంక్రాంతి సినిమాలు అజ్ఝాతవాసి, జై సింహాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా రికార్డు స్థాయి థియేటర్స్ రిలీజైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఝాతవాసి’ ప్లాపు సినిమాగా తేలిపోయింది. ఈ సినిమాకి రెండు ఆలస్యంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన నట సింహం బాలకృష్ణ ‘జై సింహా’ సినిమా విషయంలోనూ పాత చింతకాయ పచ్చడి అనే టాక్ వినబడుతోంది.

ఇప్పుడీ సినిమాపై సంచలన రివ్యూ అందజేశాడు ప్రముఖ సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి. “80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగూరగంప సినిమా “జై సింహ”. నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!’’ అంటూ ట్విట్ చేశాడు మహేష్ కత్తి.

ఇంకో విశేషం ఏమిటంటే..ఈ ఉదయం బాలయ్య, దర్శకు కె.యస్ రవికుమార్ కలిసి హైదరబాద్ భ్రమరాంబ థియేటర్ లో జై సింహా సినిమా చూశారు. ఈ థియేటర్ లోనే అదే షోకు కత్తి మహేష్ జై సింహాని వీక్షించారు. ఆ థియేటర్ లో సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా అదిరిపోయిందని చెబుతుంటే.. మహేష్ కత్తి గర్జన లేని ‘జై సింహా’గా తేల్చేశారు.