మోత్కుప‌ల్లిని వెన‌కేసుకొచ్చిన క‌డియం..!

టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ సంచ‌ల‌నం రేపిన మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీనేత‌లే కాదు , అధికార పార్టీనేత‌లు, మంత్రులు స్పందిస్తున్నారు. మోత్కుపల్లి వ్యాఖ్యలని నీను స్వాగతిస్తున్నామంటూ ఆయ‌న్ను వెన‌కేసుకొస్తున్నారు కూడా. మోత్కుప‌ల్లి కామెంట్స్ పై ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం స్పందించారు.

మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్థించారు. తెలంగాణ ఆత్మగౌరవ కోసం పనిచేసే వాళ్లంతా కలిసి వస్తున్నారని,
తెలంగాణలో టీడీపీ అంతరించిపోతుందని , అలాంట‌పుడు టీఆర్ఎస్ లో విలీనం చేస్తే మంచిదే అన్నారాయ‌న‌. ఆనాడు ఎన్టీఆర్ పిలుపినిస్తే అందరం టీడీపీలో చేరామని, ఇప్పుడు కెసిఆర్ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పిలుపునిస్తున్నారని ఆయ‌న చెప్పుకొచ్చారు.