ఇప్పటికీ బన్నీ భయపడినట్టే.. !

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం “నా పేరు సూర్య”. రచయిత వక్కంత వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. బన్నీ సరసన అను ఇమ్మానుల్ జతకట్టనుంది. ఇందులో బన్నీ జవాన్’గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాని రికార్డు స్థాయిలో ఏడు బాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఐతే, ఇప్పుడీ డేటు మారింది.

‘నా పేరు సూర్య’ మరో రెండు వారాల ముందుకు అంటే ఏప్రిల్ 13కు మారింది. దీనికి కారణం ఏప్రిల్ 27న మహేష్ “భరత్ అను నేను” కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఏప్రిల్ 27 డేటుని ముందుగా బన్నీ బుక్ చేసుకొన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి మహేష్ కూడా అదే డేటు కు వస్తున్నట్టు ప్రకటించాడు. వీరికి తోడు సూపర్ స్టార్ రజనీ రోబో ‘2.ఓ’ కోసం ఏప్రిల్ 27 డేటు వినిపించింది. ఐతే, ఆ సమయంలోనే ‘నా పేరు సూర్య’ రిలీజ్ డేటు మారడం ఖాయమనే ప్రచారం జరిగింది.

ఆ సమయంలోనే వెనక్కు తగ్గితే బన్నీ భయపడ్డాడనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుందని చిత్రబృందం ముందే ఊహించింది. అందుకే ఇన్నాళ్లు ఆగి ఇప్పుడు మహేష్ నుంచి పోటీకి తప్పుకొంది. బన్నీ, రజనీ ఇద్దరు ఏఫ్రిల్ 27 నుంచి ప్రక్కకు జరిగారు. ఇక, ఇప్పుడు మహేష్ సింగిల్. మరీ.. ఇప్పటికైనా.. మహేష్ తో పోటికి బన్నీ భయపడినున్నట్టున్నాడనే గుసగుసలు వినబడుతున్నాయి.