‘పద్మావత్’ పబ్లిక్ టాక్

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్.. తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం “పద్మావత్”. ఎన్నో అడ్డంకులు దాటుకొని రిపబ్లిక్ డే కానుకగా రేపు (జనవరి 25)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఇప్పటికే ముంబై బాలీవుడ్ సెలబ్రేటీస్ కోసం వేసిన స్పెషల్ షో తో పబ్లిక్ టాక్ బయటికొచ్చింది. ‘పద్మావత్.. ఓ మాస్టర్ పీస్’ అంటూ సింగిల్ వర్డ్ రివ్యూ అందజేశారు ప్రముఖ సినీ జర్నలిస్ట్ తరుణ్ ఆదర్శ్. ఆయన ఏకంగా 4.5 రేటింగ్ కూడా ఇచ్చారు.

సినిమా చూసిన బాలీవుడ్ ప్రముఖులు ‘పద్మావత్.. అద్భుతం’ అంటున్నారు. దీపిక కళ్లతోనే అద్భుతం చేసింది. ఆమెతో పాటు షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ లు చాలా బాగా నటించారు అంటూ స్టార్ హీరో హృతిక్ రోషన్ పొగడ్తలు గుప్పించాడు. మొత్తానికి.. రిలీజ్ ముందే ‘పద్మావత్’ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. దీనికి తోడు
వివాదాలు సినిమాకి ఫ్రీ-పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో.. పద్మావత్ ఓపెనింగ్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోయే అవకాశాలున్నాయి.

ఇదీగాక, రాజ్ పుర్ కర్ణిసేన చెబుతున్నట్టు సినిమాలో రాజ్ పుత్ రాణి పద్మావతిని అవమానించినట్టుగా సీన్స్ లేమీ లేవని చెబుతున్నారు. మరోవైపు, కర్ణిసేన విధ్వంసం కొనసాగుతూనే ఉంది. మధ్య ప్రదేష్, రాజస్థాన్, ఉత్తరప్రదేష్, గుజరాత్ రాష్ట్రాలో కర్ణిసేన పద్మావత్ విడుదలకు వ్యతిరేకంగా విధ్వంసం సృష్టించారు.