కిదాంబి – పద్మశ్రీ, ధోని – పద్మభూషణ్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కు (క్రీడారంగం) పద్మశ్రీ అవార్డు, టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి (క్రీడారంగం) పద్మభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించింది.

ముగ్గురికి పద్మవిభూషణ్, 9మందికి పద్మభూషణ్ పురస్కారాలతో పాటు మొత్తం 73మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. వీరి నేడు అవార్డులని స్వీకరించనున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.