కేసీఆర్ తో ప్రాణభ‌యం ఉంది.. !! : వంటేరు

ఉస్మానియా యూనివ‌ర్శిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో చేప‌ట్టిన నిర‌స‌న‌లో భాగంగా తెలుగు రైతు విభాగం అధ్య‌క్షులు వంటేరు ప్ర‌తాప్ రెడ్డిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఆయ‌న చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి బెయిలుపై విడుద‌ల‌య్యారు. ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రిపై ఆయ‌న విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

కేసీఆర్ తో త‌న‌కు ప్రాణ‌భ‌యం ఉంద‌ని, పోలీసుల‌తో ఎన్ కౌంట‌ర్ చేయించే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. గ‌జ్వెల్ లో ఓడిపోతాన‌ని కేసీఆర్ కు భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే త‌న‌పై క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ వ్య‌తిరేక పార్టీలన‌న్నీ ఐక్యం చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధిస్తాన‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.