చరణ్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోరుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుకుమార్ “రంగస్థలం” సెట్స్ మీద ఉండగానే నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా “సైరా నర్సింహారెడ్డి”ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇప్పుడీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని సెకండ్ షెడ్యూల్ కోసం కేరళ వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఇంతటీ భారీ చిత్రాన్ని నిర్మిస్తూనే హీరోగా బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాని మొదలెట్టి తన స్వీడుని చూపిస్తున్నాడు చరణ్.

ఇప్పుడీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొంది. ఐతే, ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొనలేదు. మిగిలిన తారగణంపైనే ఫస్ట్ షెడ్యూల్ ని కానిచ్చేశాడు దర్శకుదు బోయపాటి. వచ్చే నెలలో మొదలవ్వనున్న రెండో షెడ్యూల్ లో చరణ్ జాయిన్ కానున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. ఈ ఊరమాస్ దర్శకుడు నుంచి ఓ మాస్ హిట్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు చరణ్. మరీ.. అది ఏ మేరకు నెరవేరుతుందన్న చూడాలి.

ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.