కిర్రాక్ హీరోయిన్’కు పెళ్లి కుదిరింది

కిర్రాక్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. కన్నడ బ్లాక్ బస్టర్ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో ఫేమస్ అయిపోయింది హీరోయిన్ రష్మికా మండన్న. ఇప్పుడీ హీరోయిన్’కు తెలుగులోనూ మంచి గిరాకీ ఏర్పడింది. నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ తెలుగు రిమేక్, నాగశౌర్య ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ‘ఛలో’ సినిమా ప్రమోషన్లో తన పెళ్లి కబురు చెప్పేసింది.

హీరో రక్షిత్‌ శెట్టిని పెళ్లాడబోతుంది మండన్న. ”కిరిక్‌ పార్టీ’లో రక్షిత్‌ శెట్టి హీరో. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మనసులు కలిశాయి. పెద్దలతో మాట్లాడి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది రష్మీక. త్వరలోనే పెళ్లి డేటు కూడా చెప్పబోతుందట.