పెద్దల ఎన్నికగంట మ్రోగింది

పెద్దల ఎన్నిక గంట మ్రోగింది. దేశంలోని 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 23న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మార్చి 12వతేదీ నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. 13న నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ని విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి 3స్థానాలకు, తెలంగాణ నుంచి 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్ గౌడ్, తెలంగాణలో ఆనంద్ భాస్కర్, సీఎం రమేష్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిల పదవీకాలం ఈ ఏప్రిల్ తో ముగియనుంది.