నేడే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం

యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణోత్సవం నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు బాలాలయంలో స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం జరుగుతుంది. శ్రీరాముని అలంకరణలో హనుమంత సేవ నిర్వహిం చి 11గంటల కు గజవాహన సేవతో బాలాలయంలోకి పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురును తీసుకుని వస్తారు.


ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మంత్రులు జగదీశ్వరరెడ్డి, నాయిని నరసింహారెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక, ఈ ఉదయం లక్ష్మీ నరసింహ స్వామివారిని త్రిదండి చినజీయర్ స్వామి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.