మెగాస్టార్’ని ఏడిపించిన శ్రీదేవి

అతిలోక సుందరి శ్రీదేవి మరణం సినీ ఇండస్ట్రీ, ప్రేక్షకులకు షాక్ కు గురిచేసింది. ఈ షాక్ లోనే టాలీవుడ్ కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి శీదేవి మరణ వార్త తెలిసిన వెంటనే కంటతడిపెట్టారు. ఆమెతో త‌న‌కు సినిమాల్లో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. అతిలోక సుందరి మరణం పట్ల ఓ వీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

శ్రీదేవి మరణంపై మెగాస్టార్ ఆవేదన.. ఆయన మాటల్లోనే.. వినేయండీ.. !

మరోవైపు, అతిలోక సుందరిని అమితంగా ఇష్టపడే దర్శకుడు రాంగోపాల్ వర్మని కూడా కంటతడి పెట్టుకొన్నాడు. శ్రీదేవి మరణవార్త విన్న దగ్గర నుంది వర్మ వరుస ట్విట్స్ చేస్తూనే ఉన్నారు.

చివరిగా ‘శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్‌.. ఇప్పటి నుంచి తను ఇంకా బతికుందనే ఊహించుకుంటాను. శ్రీదేవి.. నేను మిమ్మల్ని ఎంత నవ్వించిన తర్వాత కూడా మీరు ఏడిపించడం అన్యాయం. ఇంకెప్పటికీ మీతో మాట్లాడను. లైఫ్‌ లాంగ్‌ కటీఫ్‌’ అంటూ ఎమోషన్ అయ్యాడు వర్మ.