ముంబై చేరని శ్రీదేవి మృతదేహం.. అసలేం జరుగుతోంది ?

అతిలోక సుందరి శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయి 24గంటలు గడుస్తోంది. దుబాయ్ లో వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి అక్కడే ఆదివారం తెల్లవారుజామున హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐతే, ఆమె మృతదేహాన్ని ఆదివారం సాయంత్రానికి కల్లా ముంబైకి చేరవేయనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత రాత్రి వరకు చేరుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు కూడా శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరకపోవడం పట్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇప్పటికే శ్రీదేవి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ పనులు పూర్తి చేశారు. ఐతే, కొన్ని దౌత్య పరమైన కారణాల వల్ల మృతదేహాన్ని తరలించడంలో ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరుతుందన్నది తాజా సమాచారమ్. ముంబైలోని మెహబూబ్ స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, తమ అభిమాన తారని కడసారి చూసుకోవాలని శ్రీదేవి అభిమానులు పెద్ద సంఖ్యలో ముంబై చేరుకొన్నారు.