బీజేపీలో చేరిక‌పై స్పందించిన హ‌రీష్..!!

తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు త‌న అనుచ‌ర ఎమ్మెల్యేల‌తో త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌తారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెల‌సిందే. కొన్ని మీడియాలో వ‌చ్చిన‌ట్లుగా కూడా మార్ఫింగ్ ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై మంత్రి హ‌రీష్ రావు స్పందించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ను ఎదుర్కోలేకే మంత్రి హారీష్ రావుపై ఇలాంటివి సృష్టిస్తున్నార‌ని టీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. త‌న పుట్టుక టీఆర్ఎస్ లోనే, చావు కూడా టీఆర్ఎస్ లోనే అంటూ మంత్రి హ‌రీష్ ఈ అంశంపై స్పందించారు. అన‌వ‌స‌ర‌మైన పుకార్ల‌ను సోష‌ల్ మీడియాలో సృష్టిస్తున్న‌వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాను డీజీపీని కోరాన‌ని చెప్పారు.

ఇక‌ముందు తాను పార్టీ మారుతాన‌ని ప్ర‌చారం చేసేవారు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు బాధ్యులు కావాల్సి ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఉద్య‌మంలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వ‌చ్చిన వాళ్ల‌మ‌ని, తాను టీఆర్ఎస్ లో క్ర‌మ‌శిక్ష‌ణగ‌ల కార్య‌క‌ర్త‌నని ఆయ‌న అన్నారు. కేసీఆర్ మ‌టే త‌న బాట అంటూ స్ప‌ష్టం చేశారు. పుకార్లు న‌మ్మొద్ద‌ని ఇప్ప‌టికే చాలాసార్లు విజ్ఞ‌ప్తి చేశాన‌ని, ఇప్పుడు కూడా అంద‌రినీ అదే కోరుతున్నాన‌న్నారాయ‌న.