చంద్ర‌బాబు మోస‌కారి…!! : సినీన‌టి క‌విత‌

చంద్రబాబు మోసకారి అని చాలా మంది చెబుతున్నా తాను నమ్మలేదని , ఇప్పుడే అర్ధమైందని సినీ న‌టి క‌విత అన్నారు. ఎన్టీఆర్ పై నమ్మకంతొనే టిడిపిలో చేరాన‌ని, కానీ చంద్రబాబు ఎన్టీఆర్ హామీని తుంగలో తొక్కారని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రతి పోరాటంలో తాను పాల్గొన్నప్ప‌టికీ, త‌న‌ను అవమానించి, బాధపెట్టి టీడీపీ నుంచి గెంటేశారని చెప్పారామె. చంద్రబాబును తిడుతున్న వారికేమో పదవులిచ్చారు…పార్టీ కోసం పనిచేసిన వారికి మొండిచేయి చూపారన్నారు.

పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో బిజెపి లొ చేరారు కవిత. బిజెపి కండువా వేసి పార్టీలోకి అహ్వానించారు బీజేపీ నేత‌లు. బిజెపి లో చేరిన తర్వాత క‌విత కంటనీరు పెట్టుకున్నారు. బాధతోనే టిడిపి కి రాజీనామా చేసి బిజెపి లో చేరాన‌ని ఆమె చెప్పారు. 1983 నుంచి టిడిపి కి కష్టపడి సేవ చేశాన‌ని, అయితే మోదీ ప్రవేశపెట్టిన అనేక పధకాల స్ఫూర్తితోనే బిజెపి లో చేరానన్నారు.పనిచేసిన వారికి సముచిత‌న్యాయం చేస్తానని చంద్రబాబు పదే పదే చెబితే న్యాయం చేస్తారని అనుకున్నానని, అయితే .ఇప్పటివరకు త‌కు న్యాయమైతే ఏమీ జరగలేదన్నారు.