నో మెసేజ్.. ఓన్లీ కమర్షియల్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్’లో కొరటాల శివ ఒకరు. ఓ సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు అద్ది సినిమా తీయడంలో కొరటాల దిట్ట. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను సినిమాల ద్వారా కొరటాల ఇచ్చిన సోషల్ మెసేజ్ ప్రేక్షకులని ఆకట్టుకొంది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భరత్ అను నేను’ సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకొంటోంది.

భరత్ బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో కొరటాల చేయబోయే తదుపరి సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. భరత్ ప్రమోషన్స్ పాల్గొన్న కొరటాల తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈసారి కొరటాల సోషల్ మెసేజ్ ని ఇవ్వడం లేదట. పక్కా కమర్షియల్ సినిమా తీస్తానని తెలిపాడు. ఐతే, ఏ హీరోతో కొరటాల సినిమా ఉండబోతుంది అన్నది మాత్రం చెప్పలేదు.

మహేష్ ‘భరత్ అను నేను’ సినిమా తర్వాత కొరటాల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జతకట్టాల్సి ఉంది. ఐతే, చరణ్ ఇప్పటికే బోయపాటి సినిమాతో బిజీ అయిపోయాడు. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తో కొరటాల సినిమా ఉంటుందనే వార్తలొచ్చాయ్. ‘నా పేరు సూర్య’ సినిమాని పూర్తి చేసిన బన్నీ లింగుస్వామి సినిమా లేదా ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

నానితో కొరటాల సినిమాపై వచ్చిన వార్తలు ఫేక్ అని తేలిపోయాయి. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి సినిమా ఏ హీరోతో ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.