రజనీ సినిమా రేంజ్’లో కళ్యాణ్ సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రేంజ్’లో కళ్యాణ్ రామ్ సినిమా ‘నా నువ్వే’ని ప్రమోషన్’ని ప్లాన్ చేశారు. ఎయిర్ ఏషియా విమానాలపై కబాలి సినిమా పోస్టర్స్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘నా నువ్వే’ సినిమా ప్రమోషన్స్ కోసం 400 క్యాబ్ లని వినియోగించనున్నారు. ఈ క్యాబ్ లపైన నా నువ్వే సినిమా పోస్టర్లు దర్శనం ఇవ్వబోతున్నాయి. దీంతో.. ‘నా నువ్వే’ ప్రమోషన్స్ ని రజనీ కబాలి, కాలా రేంజ్’లో నిర్వహిస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్’లో వినబడుతోంది.

ఇన్నాళ్లు యాక్షన్’తో అదరగొట్టిన కళ్యాణ్ రామ్ చేసిన తొలి రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. జయేంద్ర దర్శకుడు. కళ్యాణ్ సరసన తమన్నా జతకట్టనుంది. ఈ నెల 25న ‘నా నువ్వే’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం శరత్. మహేష్ కోనేరు, విజయ్, కిరణ్ ముప్పవరపు నిర్మాతలు. ఈ సినిమా భారీ ప్రమోషన్స్ సినిమా సక్సెస్ కు ఏ మేరకు హెల్ప్ అవుతుందనేది చూడాలి.