కేసీఆర్ చిత్తశుద్ది ఇది.. !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలం గట్టిదని చెబుతుంటారు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా 100% ఫోకస్ చేస్తారు. ఇప్పుడు రైతుబంధు విషయంలోనూ కేసీఆర్ చిత్తశుద్ది ప్రశంసించదగినది. ఈ కార్యక్రమం పక్కాగా అమలు అయ్యేలా కేసీఆర్ చర్యలు తీసుకొంటున్నారు. తాజాగా, రైతుబంధు చెక్కుల పంపణీపై ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా ఎన్ని పాసు పుస్తకాలు పంపిణీ చేశారు? ఎంత మందికి చెక్కులిచ్చారు? మిగతా వారికి ఏ కారణం వల్ల వాటిని పంపిణీ చేయలేదు? వంటి అంశాలపై సీఎం అధికారులతో సమీక్షించారు. అధికారులు మరింత చిత్తశుద్దితో కార్యక్షేత్రంలో విధులు నిర్వహించాలని సూచించారు.