‘అ’ దర్శకుడితో తమ్మూ.. ఏం చేసిందో తెలుసా ?

మిల్కీ బ్యూటీ తమన్నాది క్లీన్ ఇమేజ్ అని చెబుతుంటారు. ఇప్పటి వరకు ఆమెని ఎవరితో లింకు పెడితూ వార్తలు రాలేదు. వచ్చినా అవి వైరల్’గా మారలేదు. తాజాగా, తమ్మూ పేరు ఓ దర్శకుడితో కలిసి వినిపిస్తోంది. ఆ దర్శకుడి బర్త్ డే సెలబ్రేషన్ తమ్మూ దగ్గరుండి జరిపించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు ? అంటే ‘అ’తో ఆకట్టుకొన్న ప్రశాంత్ వర్మ.

బాలీవుడ్ క్వీన్ దక్షిణాది బాషల్లోకి రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నీలకంఠ దర్శకత్వంలో తెలుగు ‘క్వీన్’ సెట్స్ మీదకు వెళ్లింది. ఒకట్రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొంది. ఐతే, ఈ ప్రాజెక్ట్ నుంచి నీలకంఠ మధ్యలోనే తప్పుకొన్నాడు. ఇప్పుడా ఆయన స్థానంలో ‘అ’ దర్శకుడు ప్రశాంత్ వర్మని తీసుకొన్నారు. ఇటీవలే క్వీన్ షూటింగ్ సెట్స్ లో ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. హీరోయిన్ త‌మ‌న్నా స్వ‌యంగా కేక్ తెప్పించి ప్ర‌శాంత్ తో క‌ట్ చేయించింది. దీంతో ‘అ’ దర్శకుడితో కలిసి తమ్మూ పేరు వినిపిస్తోంది.