మోత్కుప‌ల్లితో ముద్ర‌గ‌డ భేటీ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుబ‌పై తిరుగుబాటుచేసి, ఆ పార్టీ నుంచి బ‌హిష్కృతుడైన మోత్కుప‌ల్లితో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ భేటీ అయ్యారు. మోత్కుప‌ల్లిని క‌లిసి ఆయ‌న‌కు సంఘీభావం తెలిపారు. తాజారాజ‌కీయ ప‌రిణామాల‌పై మోత్కుప‌ల్లితో మంత‌నాలు జ‌రిపారు.

దాదాపు రెండు గంట‌ల‌పాలు మోత్కుప‌ల్లితో చ‌ర్చించిన ముద్ర‌గ‌డ ఆయ‌న‌ను ఏపీకి రావాలిన ఆహ్వానించారు. టీడీపీని ఓడించాల‌ని ఏపీలో ర‌థ‌యాత్ర చేస్తాన‌ని మోత్కుప‌ల్లి ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో ఆ యాత్ర‌కు అన్ని ర‌కాల స‌హాయ స‌హకారాలు అందిస్తాన‌ని ముద్ర‌గ‌డ హామీ ఇచ్చారు. ఈ భేటీలో ముద్ర‌గ‌డ‌తో పాటు మ‌రో ప‌దిమంది నేత‌లు హాజ‌ర‌య్యారు. మ‌రి మోత్కుప‌ల్లి ఎలా ముందుకెళ‌తార‌నేది చూడాలి.