త్రివిక్రమ్ ని గిఫ్ట్’తో కొట్టాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అస్సలు మారడు. ఆయన ఒకే బ్యానర్’లో మాత్రమే సినిమాలు చేస్తుంటాడు. ‘హారిక అండ్ హాసిని’ బ్యానర్ లోనే సినిమాలు చేస్తుంటాడు. నిర్మాత రాథాకృష్ణతో త్రివిక్రమ్ అంతలా కనెక్ట్ అయ్యాడు. రాధాకృష్ణ కూడా త్రివిక్రమ్‌తో సినిమా అంటే బడ్జెట్‌ గురించి ఆలోచించడు. పైగా పూర్తి స్వేచ్చను ఇస్తాడు. త్రివిక్రమ్ చెప్పింది చేస్తాడు. ‘అజ్ఝాతవాసి’ నష్టాలని త్రివిక్రమ్, పవన్ లతో కలిసి రాథాకృష్ణ కూడా పంచుకొన్నారు.

‘అజ్టాతవాసి’ త్రివిక్రమ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఆ సినిమాని త్రివిక్రమ్ తీశాడంటే ఇప్పటికీ నమ్మశక్యం కాదు. దీంతో త్రివిక్రమ్ మూడ్ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఇప్పుడా మూడ్ ని సరిచేసేందుకు నిర్మాత రాథాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఇటీవలే త్రివిక్రమ్‌కు నిర్మాత రాధాకృష్ణ 3.65 కోట్లు పెట్టి రేంజ్‌ రోవర్‌ కారును కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఐతే, ఇదంతా త్రివిక్రమ్ ని మూడ్ లోకి తీసుకొచ్చేందుకే అనే ప్రచారం జరుగుతోంది.

ఇక, అజ్ఝాతవాసి అట్టర్ ప్లాపు తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అరవింద సమేత’ ప్రేక్షకుల్లో భారీ అంచాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కోసం గట్టిపోటీ నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడుపోయాయి. మొత్తంగా ‘అజ్ఝాతవాసి’ ఎఫెక్ట్ ‘అరవింద సమేత’పై పడలేదు. మరీ.. ఈసారి త్రివిక్రమ్ హిట్ కొడతాడేమో చూడాలి.