నేనెప్పుడూ ఆ… త‌ప్పు చేయ‌లేదు…! : ఏపీ సీఎం

విజ‌య‌న‌గ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు విప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. వైసీపీ నేత జ‌గ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. అవినీతి గురించి ఒకాయ‌న త‌న‌కు చెబుతున్నార‌ని, వారం వారం అవినీతి కేసులో కోర్టుకెళ్లే వారు కూడా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు చంద్ర‌బాబు. అవినీతిప‌రులైన గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిల‌కు బీజేపీ అండ‌గా ఉంటున్నార‌ని అన్నారు.

తానెప్పుడూ మందు తాగ‌లేద‌ని, సిగ‌రెట్ తాగ‌లేద‌ని, అమ్మాయితో తిర‌గ‌లేద‌ని చెప్పారు ఏపీ సీఎం. తానెప్పుడూ త‌ప్పు చేయ‌న‌ని, అవినీతికి పాల్ప‌డితే ఎంత‌టివారైనా స‌హించేది లేద‌న్నారు. అగ్రిగోల్డ్ లో న‌ష్ట‌పోయిన ప్ర‌తీ ఒక్క‌రికీ న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. పెట్రోల్ పై పైసా త‌గ్గించ‌డం పెద్ద జోక్ గా అభివ‌ర్ణించారు ఆయ‌న‌.