జ‌గ‌న్ తో క‌లిసి న‌డుస్తా..! ప‌వ‌న్ ను కూడా క‌లుస్తా !!

విజ‌య‌సాయిరెడ్డితో భేటీ త‌రువాత మోత్కుప‌ల్లి త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. చంద్ర‌బాబు త‌న‌ను మోసం చేశార‌ని, క‌మ్మ కులంలో చంద్ర‌బాబు చెడ‌బుట్టారంటూ తీవ్ర‌స్థాయిలో విమర్శ‌లు కురిపించారు. జ‌గ‌న్ ప్ర‌జ‌ల కోసం తిరుగుతున్నార‌ని, ఆయ‌న కుటుంబంలో న‌లుగురు ద‌ళితుల‌ను పెళ్లిచేసుకున్నార‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ కు త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని, అవ‌స‌ర‌మైతే ఆయ‌న‌తో ఒక‌రోజు క‌లిసి తానూ న‌డుస్తాన‌న్నారు మోత్కుప‌ల్లి. తిరుప‌తికి వెళ్లి వేంక‌టేశ్వ‌రుని చంద్ర‌బాబును ఓడించ‌మ‌ని వేడుకుంటాన‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిసి ఆయ‌న‌కు కూడా సంఘీభావం తెలుపుతాన‌న్నారు.