మోత్కుప‌ల్లితో విజ‌య‌సాయిరెడ్డి భేటీ…!!

టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి భేటీ అయ్యారు. గ‌తంలో ఆయ‌న నివాసంలో మోత్కుప‌ల్లితో భేటీ అవడానికి వ‌చ్చినా మీడియాను చూసి కారుదిగ‌కుండానే వెనుదిరిగి వెళ్లారు. గురువారం మోత్కుప‌ల్లితో భేటీ అయిన విజ‌య‌సాయి రెడ్డి గంట‌పాటు ఆయ‌న‌తో చ‌ర్చిచారు. చంద్ర‌బాబును ఓడించేందుకు తాము కూడా మోత్కుప‌ల్లికి అండ‌గా ఉంటామ‌ని విజ‌సాయిరెడ్డి హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది..

మోత్కుప‌ల్లితో భేటీ అనంత‌రం విజ‌య‌సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాయ‌కుల‌ను వాడుకుని వ‌దిలేయ‌డం చంద్ర‌బాబు స‌హ‌జ‌శైలి అని , అనుభవం ఉన్న ద‌ళిత నేత మోత్కుప‌ల్లిని స‌స్పెండ్ చేయ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న అన్నారు. ప‌రిస్థితి చూస్తే చంద్ర‌బాబు ద‌ళిత వ్య‌తిరేక బుద్ధి బ‌య‌ట‌ప‌డుతోంద‌న్నారు. ఎట్టిప‌రిస్థితుల్లో చంద్ర‌బాబును అధికారం నుంచి దింపాల‌ని మోత్కుప‌ల్లి చెప్పార‌ని ఆయ‌న తెలిపారు.