కొత్త పొలిటికల్ ఆఫర్.. భలేగుందే !

రాజకీయ నేతల తీరు మారుతోంది. తన పుట్టినరోజు వేడుకల ఖర్చు కోసం తెలంగాణలో ఓ నాయకుడు వసూళ్లకు పాల్పడినట్టు వార్తలు వినిపించాయి. ఇది విని జనాలు నవ్వుకొన్నారు. ఐతే, మహారాష్ట్రలో శివసేన బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పార్టీ అధినేత రాజ్ థాక్రే 50వ పుట్టినరోజు కానుకగా పెట్రోల్ ని రూ. 4 తక్కువగా విక్రయించారు. ముంబైతో పాటుగా, రాష్ట్రంలోని 50 పెట్రోల్ బంకుల్లో ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ పొలిటికల్ ఆఫర్ దేశ వ్యాప్తంగా జనాల దృష్టిని ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియా వేదికగా ఈ పొలిటికల్ ఆఫర్ పై చర్చ జరుగుతోంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీ నేతల పుట్టినరోజుకి ఇలాంటి ఆఫర్ ని తీసుకొస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రల్లోనూ చంద్రబాబు, లోకేష్.. కేసీఆర్, కేటీఆర్, కవితక్కల.. పుట్టినరోజు కానుకగా ఇలాంటి ఆఫర్స్ ప్రకటిస్తే బాగుంటుందని చెప్పుకొంటున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి పొలిటికల్ ఆఫర్స్ పుట్టుకురావడం సహజమే. వీటికి ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని మరికొందరు అంటున్నారు.