దారుణం : 12యేళ్ల కవలల్ని హత్య చేసిన మేనమామ

హైదరాబాద్ చైతన్యపురిలో దారుణం చోటు చేసుకొంది. 12యేళ్ల కవలల్ని మేనమామ దారుణంగా హత్య చేశాడు. హత్య చేసి స్నేహితుడి కారులో మృత దేహాలని తరలించే ప్రయత్నం చేస్తుండగా ఇంటి ఓనర్ గమనించి కేకలు వేయడంతో.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు మల్లికార్జున్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు.

నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి-లక్ష్మీ దంపతులకి మాససిక వికాలాంగులైన కవలలు జన్మించారు. ఐతే, వీరికి స్మిగింగ్ నేర్పించడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుందని చెప్పి మేనమామ హైదరాబాద్ చైతన్యపురిలోని తన నివాసానికి తీసుకొచ్చాడు. పిల్లలు పడుకొన్నాక.. అర్థరాత్రి 12గంటల సమయంలో ఇద్దరు పిల్లల్ని గొంతు నమిలీ అత్యంత దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. ఐతే, ఈ దారుణం వెనక తల్లిదండ్రుల పాత్ర ఏమైనా ఉందా.. ? అనే అనుమానాలు తలెత్తున్నాయి.