ఢిల్లీలో చంద్ర‌బాబు.. ఆ ముగ్గురితో కీల‌క భేటీ.. !!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. రేపు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగే నీతిఅయోగ్ 4వ పాల‌క‌మండ‌లి స‌మావేశంలో ఆయ‌న పాల్గొంటారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆయ‌న ఏపీ భ‌వ‌న్ చేరుకున్నారు. చంద్ర‌బాబుతో పాటు మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు , ఎంపీలు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, కేశినేని నాని, క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్, కంభంపాటి రామ్మోహ‌న్ రావు ఉన్నారు.

ఏపీ భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రులు మ‌మ‌త బెన‌ర్జీ , కుమార‌స్వామి చంద్ర‌బాబును క‌లుస్తారు. కొద్దిసేపు స‌మావేశ‌మైన అనంత‌రం నేరుగా ముగ్గురు ముఖ్య‌మంత్రులు క‌లిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ నివాసానికి వెళ్లి అర‌వింద్ కేజ్రీవాల్ ను క‌లుస్తారు. థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఢిల్లీలో వీరి భేటీకి ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇప్ప‌టికే తెలుగు రాజ‌కీయాలు ఢిల్లీకి చేరిన నేప‌థ్యంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన నేప‌థ్యంలో వీరి భేటీ పొలిటిక‌ల్ హీట్ మ‌రింత పెంచుతోంది.