పేద ముస్లింల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు..!

రంజాన్ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు ముస్లిం సోద‌రుల‌కు హామీల వ‌ర్షం కురిపించారు. సిద్ధిపేట ప‌ట్ట‌ణంలోని ఈద్గా వ‌ద్ద రంజాన్ వేడుక‌ల్లో పాల్గొన్న ఆయ‌న ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ఆత్మ‌విశ్వాసంతో బ్ర‌తుకుతున్నార‌ని, దేశంలో ఎక్క‌డా లేని విధంగా సీఎం కేసీఆర్ షాదీముబారక్ తో ముస్లిం మ‌హిళ‌ల‌కు ఆర్థిక‌సాయం అందిస్తున్నార‌ని ఆయన అన్నారు.

రెండొంద‌ల‌కు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలను ముస్లిం ల కోసం ప్రారంభించార‌ని, ఏ పండుగ‌లైనా పేద ప్ర‌జ‌ల‌కు కొత్త బ‌ట్ట‌లు పంపిణీ చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. రాబోయే రోజుల్లో పేద ముస్లింల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామ‌ని, ముస్లింల అభ్యున్న‌తికి తెలంగాణ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. రాష్ట్రంలో హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ త్వ‌ర‌గా సాధిస్తామ‌న్నారు.