యుఎస్ సెక్స్ రాకెట్’పై అనసూయ అప్పుడే హింట్ ఇచ్చిందా ?

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్స్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిర్మాత కిషన్ మోదుగుడి దంపతులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వెంట్ల పేరుతో టాలీవుడ్ హీరోయిన్స్ ని యుఎస్ తీసుకెళ్లి అక్కడ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ సెక్స్ రాకెటే లో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరి నెలకోసారి యూఎస్ టూర్ వెళ్లాస్తారని చెబుతున్నారు.

ఈ సెక్సె రాకెట్ పై 2016లోనే యాంకర్ అనసూయ హింట్ ఇచ్చిందని చెబుతున్నారు. ఆ సమయంలో అనసూయ, సంపూర్ణేష్ బాబులు శ్రీరాజ్ చెన్నమనేని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి యుఎస్ టూర్ కి వెళ్లిన అనసూయ.. 2016లో వెళ్లేందుకు నిరాకరించింది. శ్రీరాజ్ మాట్లాడిన తీరు నచ్చకే వెళ్లలేదని తెలిపింది. ఆయన కమిట్ మెంట్ ఇస్తారా అంటూ హద్దలు దాటినట్టు అప్పట్లోనే లీకులిచ్చింది.

తాజాగా, యుఎస్ సెక్స్ రాకెట్ పై యాంకర్ కమ్ నటి అనసూయ, ఈ మధ్య ఇండస్ట్రీని షేక్ చేసే కామెంట్స్ చేస్తున్న శ్రీ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా 2016లో తాను యుఎస్ టూర్ కి వెళ్లేందుకు నిరాకరించిన విషయాన్ని అనసూయ గుర్తు చేసింది. ఇక, శ్రీరెడ్డి ఓపెన్ గా ఇదంతా కామన్. ఆ ఆఫర్ తనకి కూడా వచ్చింది. క్రేజ్ ని బట్టి రేటు ఇస్తారు అంటూ తెలిపింది. దీన్నిబట్టి యుఎస్ టాలీవుడ్ హీరోయిన్స్ ల సెక్స్ రాకెట్ పై 2016లోనే అనసూయ హింట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది.

ఇక, యుఎస్ సెక్స్ రాకెట్ పై మా అసోసియేషన్ అలెర్ట్ అయ్యింది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 24న సమావేశం కానుంది. ఇప్పటికే డ్రగ్స్, శ్రీరెడ్డి వ్యవహారంతో ఇండస్ట్రీ పరువుపోయింది. ఇప్పుడు యుఎస్ లో సెక్స్ రాకెట్ వ్యవహారం తెలుగు ఇండస్ట్రీ షేక్ చేస్తోంది. మరీ.. ఈ వ్యవహారంపై ‘మా’ ఎలా స్పందిస్తున్నది అనేది చూడాలి.