వాజ్ పేయిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు

భార‌త మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్ పెయి ఆరోగ్యం క్షీణించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. నీతీఆయోగ్ పాల‌క‌మండ‌లి స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, న్యూ ఢిల్లీ లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి కుటుంబ సభ్యులు శ్రీ రంజన్ భట్టాచార్య ను అడిగి తెలుసుకున్నారు.