ఆ త‌రువాత పీసీసీని నేనే..!

ఎక్సెపెల్ ఎమ్మెల్యే సంప‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ లో పార్టీ ప‌ద‌వులు , బాధ్య‌త‌ల‌పై చ‌ర్చ‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో సంప‌త్ కు ఏ ప‌ద‌వి కావాలో అంటూ ప‌లువ‌రు ఛ‌లోక్తులు విసిరారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందేమో అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా ఆ ప‌ద‌వి త‌న‌కు అక్క‌ర లేద‌ని, నిర్ణ‌యాలు తీసుకునే ప‌ద‌వి ఉండాలంటూ సంప‌త్ చెప్పుకొచ్చారు. 2019 ఎన్నిక‌ల త‌రువాత‌, 2019-2024 మ‌ధ్య పీసీసీని తానేనని చెప్పారు సంప‌త్. కాంగ్రెస్ సంప‌త్ ప‌ర్మినెంట్ అని ధీమాగా చెప్పారాయ‌న‌. స‌ర‌దాగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసినా మ‌న‌సులో ఎంతో కొంత బ‌ల‌మైన కోరిక ఉండే ఉంటుందని అనుకుంటున్నారు ప‌లువురు. చూడాలి మ‌రి సంప‌త్ ను పీసీసీ ప‌దవి ఎప్పుడు వ‌రిస్తుందో..