తారక్-చరణ్’లలో.. చరణ్ తప్పుకొన్నాడు !

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్-చరణ్’ల మల్టీస్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ యేడాదియే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఐతే, అంతకంటే ముందే ఎన్టీఆర్, చరణ్ లు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ‘అరవింద సమేత’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయ్యిందని చెబుతున్నారు. దసరా కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. హై వొల్టేజ్ యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కుతోన్న చిత్రమిది. చరణ్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. ఐతే, ఇప్పటికే దసరా రేసులో తారక్ నిలిచాడు. ఈ నేపథ్యంలో చరణ్ దసరా రేసు నుంచి తప్పుకొన్నట్టు సమాచారమ్. చరణ్ దీపావళీకి రంగంలోకి దిగనున్నాడు.